బాలికల హాస్టల్లో స్వేట్టర్ల అందజేత
NEWS Nov 28,2024 05:42 pm
నిర్మల్లోని ప్రభుత్వ బాలికలకు బీసీ హాస్టల్లో విద్యార్ధినులకు లయన్స్ క్లబ్ సభ్యులు స్వేట్టర్లను అందించారు. క్లబ్ సభ్యులు విద్యార్ధినులను ఉద్దేశించి మాట్లాడుతూ.. మొబైల్ చూస్తూ సమయం వృధా చేసుకోకుండా, చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలని,శ్రద్దగా చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు చంద్ర మోహన్ రెడ్డి, ప్రోగ్రామ చైర్మెన్ నేరెల్ల హనుమంతు, జోన్ చైర్మన్ లక్కడి రాజేశ్వర్ రెడ్డి, హాస్టల్ వార్డెన్ వనజ తదితరులు పాల్గొన్నారు.