విద్యార్థులు పాఠశాలకు 100% హాజరు కావాలి
NEWS Nov 29,2024 04:03 am
లోకేశ్వరం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖాధికారి రామరావు సందర్శించి 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు పాఠశాలకు, ప్రత్యేక తరగతులకు 100% హాజరు కావాలన్నారు. విద్యార్థులు ఉపాధ్యాయుల బోధించే విషయాలను చక్కగా విని, అవగాహన చేసుకోవాలని సూచించారు. భోధనాంశాలలో వెనుకబడిన అంశాలను గుర్తించి, ప్రత్యేక పునశ్చరణ చేస్తూ కష్టపడి చదవాలన్నారు. చక్కని అలవాట్లు కలిగి, మంచి భోజనం చేసి, ఆరోగ్యం కాపాడుకోవాలన్నారు.