ఇబ్రహీంపట్నం కేడీసీసీ బ్యాంకులో సంబరాలు
NEWS Nov 27,2024 02:13 pm
కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మరో కీర్తిని అందుకుంది. 2023- 24కు గానూ అత్యుత్తమ బ్యాంకుగా ఎంపిక కాగా న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా చైర్మన్ కొండూరు రవీందర్రావు, సీఈవో ఎన్. సత్యనారాయణరావు అవార్డును తీసుకున్నారని, బ్యాంక్ మేనేజర్ రామకృష్ణ, అసిస్టెంట్ మేనేజర్ అబ్దుల్ కలీం పాషా, బ్యాంక్ సిబ్బంది కేక్కట్ చేసి, ఖాతాదారులకు స్వీట్లు పంచుతూ సంతోషం వ్యక్తం చేశారు.