రికవరీ ఫోన్ ఇచ్చిన పోలీసులు
NEWS Nov 27,2024 02:10 pm
కోరుట్ల పట్టణానికి చెందిన అబ్దుల్ జావీద్ 2 నెలల క్రితం కోరుట్ల పట్టణ శివారులో ఫోన్ పొగొట్టుకున్నాడు. ఈ మేరకు కోరుట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో సిఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫోన్ రికవరీ చేసి బుదవారం బాధితుడికి ఎస్సై P. రామచంద్రం అందజేశారు. ఎవరైనా ఫోన్ పోగొట్టుకుంటే పోలీస్ స్టేషన్లో సంప్రదిస్తే సిఈఐఆర్ పోర్టల్ ద్వారా గుర్తించవచ్చని ఎస్ఐ తెలిపారు.