వడ్డెర్లకు రాజ్యసభ సీటును కేటాయించాలి
NEWS Nov 27,2024 01:26 pm
ఆంధ్రప్రదేశ్ లో వడ్డెర్లు సుమారు 40 లక్షల జనాభా కలిగి వున్నారని, చట్టసభల్లో ఇంతవరకూ ప్రాతినిద్యం లేని వడ్డెర్లకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలని వడ్డెర నాయకులు, ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజవర్గం కొండపల్లి మున్సిపాలిటీ వడ్డెర సంఘముగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అన్ని పార్టీలు వడ్డెర్లకు ఎమ్మెల్యే,ఎంపీ సీట్లు ఇస్తామని మోసం చేశాయని, బీసిల్లో అధిక జనాభా కలిగిన వడ్డెర్లకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలని కోరారు.