పోలీసుల విచారణకు కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ గైర్హాజరయ్యారు. పోక్సో కేసు విచారణ కోసం మధ్యాహ్నం 2 గంటలకు పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్లో హాజరు కావాలని ఆయనకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. తన కుమార్తెను భగీరథ్ వేధిస్తున్నాడంటూ 17 ఏళ్ల బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్లో ఈ నెల 8న కేసు నమోదైన సంగతి తెలిసిందే.