భారతీయుల వద్ద సుమారు 30 వేల టన్నుల బంగారం ఇళ్లలోనే నిల్వగా ఉందని అంచనా. దీంతో దేశం భారీగా బంగారం దిగుమతులు చేసుకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని మార్చేందుకు కేంద్రం కొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీని తీసుకురానుంది. ప్రజలు తమ బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే వడ్డీతో పాటు పన్ను మినహాయింపులు కూడా ఇవ్వాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం కనీసం 2 వేల టన్నుల బంగారం బ్యాంకింగ్ వ్యవస్థలోకి వస్తే దిగుమతులు తగ్గి రూపాయి విలువ బలోపేతం కావడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుంది.