జీడిపిక్కల కంపెనీని తెరిపించాలని ర్యాలీ
NEWS Nov 27,2024 01:25 pm
చిన్నంపేట ఇంటర్ స్నాక్ క్యాష్ జీడి పిక్కల పరిశ్రమ తెరిపించాలని 49 మందికి ఉపాధి ఇవ్వాలని కోరుతూ బుధవారం ఏలేశ్వరం తాసిల్దార్ కార్యాలయం వద్ద కార్మికులు ధర్నా చేశారు. అనంతరం మెయిన్ రోడ్డు మీదగా బాలాజీ చౌక్ సెంటర్లో మానవహారం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు రొంగల ఈశ్వరరావు, పాకలపాటి సోమరాజు మాట్లాడుతూ పరిశ్రమ మూసివేతని తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు