మహిళా సంరక్షణ చట్టాలపై అవగాహన
NEWS Nov 27,2024 01:38 pm
మలికిపురం దీప్తి మహిళా కాలేజిలో విద్యార్థి నాయకులు గణేష్ పోలిశెట్టి ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మలికిపురం SI సురేష్ పాల్గొని మాట్లాడుతూ.. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆడపిల్లల సంరక్షణకై అనేక చట్టాలను తీసుకొని వచ్చాయని, వాటిపై అవగాహన పెంచుకుని, ఏ ఇబ్బందీ వచ్చినా పోలీసు వారి దృష్టికి తీసుకురావాలని సూచించారు.