న్యాయవాదుల అధికార ప్రతినిధిగా లింబాద్రి
NEWS Nov 27,2024 09:37 am
తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ న్యాయవాదుల సంఘం అధికార ప్రతినిధిగా మెట్పల్లి న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పుప్పాల లింబాద్రిని నియమించినట్లు తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కొండల్ రెడ్డి తెలిపారు. న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. తన ఎన్నికకు సహకరించిన వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.