మరణంలోనూ వీడని స్నేహం
NEWS Nov 27,2024 09:36 am
వెల్గటూర్ మం. కొత్తపల్లి వద్ద ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు మరణించిన విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళ్తే.. పుట్టినరోజు వేడుకల్లో హాజరుకావడానికి బైకుపై వెళ్తున్న సమయంలో ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంతో కుక్కలగూడుర్ గ్రామానికి చెందిన బడుగు సాగర్ (19), కుదిరే సాగర్ (18), అవినాష్(19) అనే ముగ్గురు స్నేహితులు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.