వైష్ణవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ను ప్రారంభించిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు
NEWS Nov 27,2024 09:06 am
మైలవరంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వైష్ణవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ను మైలవరం MLA వసంత వెంకట కృష్ణప్రసాదు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యానికి, వైద్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు తక్కువ ఖర్చుతో అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని,సేవా దృక్పథంతో ఆసుపత్రి నిర్వహించాలని సూచించారు.