అన్నవరం దేవస్థానం ఈవోగా త్రినాధరావు బాధ్యతలు
NEWS Nov 27,2024 08:59 am
ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం కార్యనిర్వహణ అధికారిగా వేండ్ర త్రినాధరావును నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం సింహాచలం దేవస్థానం ఈవోగా ఉన్న ఆయనను అన్నవరం దేవస్థానం ఈవోగా నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులు అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తాని తెలిపారు.