నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలి
NEWS Nov 27,2024 09:04 am
KDP: రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్ CMDని కోరారు. తిరుపతిలో మంగళవారం CMDని కలిసి పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రైల్వేకోడూరు నియోజకవర్గంలోని పలుచోట్ల విద్యుత్ సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని కోరారు. పోల్స్, విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్ల కొరత ఉందని వీటిని వెంటనే పరిష్కరించాలని కోరారు.