రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థికి సన్మానం
NEWS Nov 26,2024 08:50 am
జిల్లా స్థాయి అథ్లెటిక్స్ కిడ్స్ జావలిన్ త్రో లో సత్తా చాటి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన మెట్పల్లి మండలం వేంపేట గ్రామానికి చెందిన విద్యార్థి పెంటపర్తి అశ్విత్ ను సన్మానించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ ఏలేటి లక్ష్మి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.