చేగుంట పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవం
NEWS Nov 26,2024 07:58 am
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చేగుంటలో రాజ్యాంగ పీఠికను ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ సందర్భంగా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు చల్లా లక్ష్మణ్ మాట్లాడుతూ.. ప్రజలందరూ రాజ్యాంగాన్ని గౌరవించాలని, రాజ్యాంగ నిర్మాతల ఆశయాలు నెరవేర్చాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో రాజేశ్వర్ శారద, మనోహర్ రావు,వెంకటేష్ , ఉమామహేశ్వరి, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.