ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
NEWS Nov 26,2024 07:57 am
భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మల్యాల మండలంలోని బ్లాక్ చౌరస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి మండల అంబేద్కర్ సంఘ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్వేచ్ఛ, సమానత్వం సంపూర్ణంగా పురివిప్పిన సుదినం అని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆనంద రెడ్డి, ఆదిరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మణ్, ఈశ్వర్, తిరుపతి, ప్రసాద్, హరినాథ్, ఇమామ్, ప్రశాంత్, మారుతి, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.