గురుకులంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
NEWS Nov 26,2024 06:43 am
కోరుట్ల మైనారిటీ గురుకుల పాఠశాలలో రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ అంబేడ్కర్ చిత్రానికి పూలమాలలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శంకర్ విద్యార్థులతో రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, రాజ్యాంగాన్ని రూపొందించిన విధానం, దాని మూలాధారాల గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.