గల్ఫ్ మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా
NEWS Nov 26,2024 06:43 am
కోరుట్ల నియోజకవర్గం నుండి గల్ఫ్ దేశాలకు వెళ్లిన వ్యక్తులు ప్రమాదవశాత్తు అక్కడ మరణించారు. బాధిత కుటుంబాలకు కోరుట్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఎక్స్గ్రేషియా ప్రొసీడింగ్ పత్రాలను అందించారు. ఒక్కోక్కరికి 5 లక్షల రూపాయల విలువ చేసే ప్రొసీడింగ్ను 8 మంది కుటుంబ సభ్యులకు మొత్తం 40 లక్షల రూపాయలు విలువ చేసే 8 ఎక్స్గ్రేషియా ప్రొసీడింగ్ పత్రాలను అందించారు.