అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన
NEWS Nov 26,2024 08:51 am
జనగామ జిల్లా జఫర్గడ్ మండల కేంద్రంలో వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం నిర్వహించారు. విగ్రహ ప్రతిష్టాపనలో మాజీ మంత్రి తాటికొండ రాజయ్య హాజరయ్యారు. ఆ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను రాజయ్య అభినందించారు.