డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన దివ్యాంగులు, అలాగే దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేసిన వ్యక్తులకు రాష్ట్ర ప్రభుత్వం అందించే రాష్ట్రీయ దివ్యాంగుల సాధికారత అవార్డుల(2024)కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. జనగామ జిల్లా సంక్షేమ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.ఆసక్తి కలిగిన వారు జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో ఈనెల 29లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.