టీడీపీ స్థాపించిన గత 43 ఏళ్లలో ఈసారి కేవలం 29 రోజుల వ్యవధిలో 50 లక్షల మార్కును దాటిపోయింది. గత నెల 26న ప్రారంభమైన సభ్యత్వ నమోదు రాజంపేట నియోజకవర్గం 93,299 సభ్యత్వాలతో అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణలో సైతం సభ్యత్వ నమోదు పుంజుకుంది. 100 రూపాయల సభ్యత్వంతో గతంలో రూ. 2 లక్షలు ఉన్న ప్రమాద బీమాను ప్రస్తుతం రూ.5 లక్షలకు పెంచారు.