ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయండి
NEWS Nov 25,2024 03:59 pm
వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్మల్ గ్రామీణ మండలం రత్నాపూర్ కాండ్లి గ్రామ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ తో కలిసి ఆమె తనఖీ చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలను కల్పించాలన్నారు. రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ ప్రక్రియను పూర్తిచేసి, ధాన్యానికి సంబంధించిన రసీదుని ఇవ్వాలన్నారు.