కస్తూరిబా పాఠశాలలో వైద్య ఆరోగ్య శిబిరం
NEWS Nov 25,2024 03:45 pm
కథలపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ రెసిడెన్షియల్ స్కూల్ లో వైద్యాధికారి సింధుజా ఆధ్వర్యంలో వైద్యారోగ్య శిబిరం ఏర్పాటు చేశారు. హాస్టల్ లోని పరిసరాలు, విశ్రాంతి గదులు, టాయిలెట్స్, వంటగది, స్టోర్ రూంలను తనిఖీ చేశారు. వివిధ రకాల రుగ్మతలతో బాధపడుతున్న విద్యార్థులకు స్క్రీనింగ్, రక్త పరీక్షలు చేసి 45మందికి చికిత్స అందించారు. విద్యార్థులందరికీ వ్యక్తిగత పరిశుభ్రత, సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు.