చాగల్నాడు కాలువ పూడ్చివేతపై ఫిర్యాదు
NEWS Nov 25,2024 03:43 pm
6 గ్రామాలకు చెందిన 5వేల ఎకరాలకు సాగునీరు అందించే చాగల్ నాడు ఎత్తిపోతల పథకం పంట కాలువను అక్రమంగా పూడ్చి వేయటంపై ఆయికట్టు రైతు సంఘం నాయకుడు పుట్టా సోమన్న చౌదరి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోమవారం పెద్దాపురం ఆర్టీవో శ్రీ రమణికి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో విజ్ఞప్తి పత్రాన్ని అందజేశారు. రైతులకు తీరని నష్టం జరుగుతోందని సమస్య పరిష్కరించాలని కోరారు.