కథలాపూర్ మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, అభిమానులు వేములవాడలో ఈరోజు జరిగే సీఎం బహిరంగ సభకు వాహనాలల్లో భారీగా తరలి వెళ్లారు. మండలంలో 19 గ్రామాలు ఉండగా.. ప్రతి గ్రామం నుంచి 100 మందిని వాహనాలల్లో నాయకులు తరలించారు. కథలాపూర్ మండలం నుంచి 2 వేల మందిని తరలించినట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగరాజు తెలిపారు.