సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను తప్పులు లేకుండా పకడ్బందీగా చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మెట్పల్లి మున్సిపల్ పరిధిలోని ఆరెపేటలో జరుగుతున్న కుటుంబ సర్వేను బుధవారం ఆయన పరిశీలించారు. సర్వే పూర్తి అయిన ప్రతి ఇంటిపైన స్టిక్కర్ కచ్చితంగా అతికించాలని సూచించారు. ఆయన వెంట ఆర్డీఓ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ మోహన్ తదితర అధికారులు ఉన్నారు.