హైకోర్టును ఆశ్రయించిన హర్షసాయి
NEWS Oct 22,2024 06:40 am
ఓ యువతి తనును ఆర్థికంగా మోసం చేశాడని, లైంగికంగా వేధించాడని యూట్యూబర్ హర్షసాయిపై నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అతనిపై పలు సెషన్లపై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం హర్షసాయి పరారీలో ఉన్నాడు. ఈ క్రమంలో హైకోర్టులో హర్షసాయి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. నేడు తెలంగాణ హైకోర్ట్ బెయిల్ పిటిషన్ విచారించనుంది. హర్షసాయి తండ్రిపై కూడా సదరు యువతి ఫిర్యాదు చేసింది.