రష్మిక మందనాకు అరుదైన గౌరవం
NEWS Oct 15,2024 05:23 pm
నటి రష్మిక మందనాకు అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ (14C)కి బ్రాండ్ అంబాసిడర్గా రష్మిక నియామకమైంది. ఈ విషయాన్ని రష్మిక సోషల్ మీడియా వేదికగా తెలిపింది. బాధ్యతలు అప్పగించినందుకు హోంశాఖకు ధన్యవాదాలు తెలిపింది. కొద్దినెలల కిందట తన డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యిందని.. అది ఒక సైబర్ క్రైమ్ అని పేర్కొంది.