వయనాడ్ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంక
NEWS Oct 15,2024 05:02 pm
కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికకు ప్రియాంక గాంధీని కాంగ్రెస్ తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో ప్రియాంక గాంధీ ఫస్ట్ టైమ్ ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడ్తో పాటు రాయ్ బరేలి నుండి పోటీ చేసి 2 చోట్ల గెలుపొందడంతో, వయనాడ్ లోక్సభ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో వయనాడ్ స్థానానికి నవంబర్ 13న ఉప ఎన్నిక జరగనుంది.