పేద ప్రజల ఆహార భద్రత కోసం ప్రభుత్వాలు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతున్న
క్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ సీరియస్గా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల రైస్ మిల్ తనిఖీ చేశారు. పరిటాల గ్రామంలో లక్ష్మీ గణపతి రైస్ మిల్లును మంత్రి నాదెండ్ల తనిఖీ చేసి అక్రమంగా నిలవకుండా రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. అక్రమంగా నిల్వ ఉన్న 100 టన్నుల బస్తాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు.