తుది శ్వాస వరకు సేవలో కలామ్
NEWS Oct 15,2024 05:38 pm
ఖమ్మం: మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపిజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ డాక్టర్ అన్నం సేవా ఫౌండేషన్ అనాధల ఆశ్రమంలో కధంబం మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో అన్నం సేవా ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ అన్నం శ్రీనివాసరావు, సామాజికవేత్త పర్యావరణ మిత్ర జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ కడవెండి వేణుగోపాల్, కేశవపట్నం శ్రీనివాస్, గడ్డం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు .