అడవి ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
NEWS Oct 15,2024 05:36 pm
చిరుత పులి సంచరిస్తున్న నేపథ్యంలో జూలూరుపాడు, ఏన్కూరు మండల సరిహద్దు అటవీ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జూలూరుపాడు సీఐ ఇంద్రసేనారెడ్డి పిలుపునిచ్చారు. మున్యా తండా పరిసర ప్రాంతాల్లో చిరుతపులి సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు ధ్రువీకరించారని చెప్పారు. ఈ కారణంగా పరిసర ప్రాంతాల ప్రజలు ఒంటరిగా బయటకు వెళ్లవద్దని, సరిహద్దు ప్రాంత రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.