దేశ యువతకు ఆదర్శం అబ్దుల్ కలాం
NEWS Oct 15,2024 05:34 pm
భారతదేశ యువతకు ఆదర్శం అబ్దుల్ కలాం అని బీజేపీ సీనియర్ నాయకులు గుమలాపురం సత్యనారాయణ అన్నారు. అబ్దుల్ కలాం జయంతి కార్యక్రమాన్ని కొత్తగూడెం పట్టణం రామా టాకీస్ ఏరియాలో నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. రాష్ట్రపతిగా ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. భారతరత్న అవార్డు గ్రహీత, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా శాస్త్ర సాంకేతిక రంగాలకు ఆయన ఆదర్శం అన్నారు.