రేపు పుల్కల్ లో మంత్రి పర్యటన
NEWS Oct 15,2024 05:32 pm
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో బుధవారం మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పుల్కల్ మండలం శివంపేట గ్రామంలో ఉదయం 10 గంటలకు తెలంగాణ వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తారు. అనంతరం బస్వాపూర్ గ్రామంలో 25ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి ఉదయం 11:30 నిమిషాలకు శంకుస్థాపన చేయనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.