బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం
NEWS Oct 15,2024 05:30 pm
నారాయణాఖేడ్ మండలం సంజీవ్ రావుపేట్ గ్రామంలో రెండురోజుల క్రితం మిషన్ భగీరథ నుండి వచ్చిన కలుషిత నీరు తాగి ఇద్దరు వ్యక్తులు మరణించారు. 200 మంది అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్ మృతి చెందిన ఇద్దరు కుటుంబ సభ్యుల ఇంటికి వెళ్ళి పరామర్శించారు. మృతి చెందిన ఒక్కోక్క కుటుంబానికి 50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.