సహకార భారతి మహాసభ పోస్టర్ను ఆవిష్కరణ
NEWS Oct 15,2024 01:42 pm
కొత్తపల్లి మండలంలోని చింతకుంట గ్రామంలోని రైతుసంఘ భవనంలో జరిగే సహకార భారతి రాష్ట్ర మహాసభ పోస్టర్ను వ్యవసాయ ఎడిఎ కె. రణధీర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 20న జరిగే సహకార భారతి రాష్ట్ర మహాసభకు పెద్ద ఎత్తున రైతులు వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏఓ మామిడి కృష్ణ, ఎఇఓ సిహెచ్ రాంరెడ్డి, రైతు సంఘం అధ్యక్షులు, సంఘ కన్వినర్, సంఘ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.