మత్స్యకారుల కోసం ప్రభుత్వం కృషి
NEWS Oct 15,2024 01:48 pm
ఖమ్మం జిల్లా కార్పొరేషన్ పరిధిలోని బల్లేపల్లి చెరువులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేప పిల్లలను విడుదల చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, మత్స్యకారుల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని మంత్రి తుమ్మల చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, ఖమ్మం నగర మేయర్ నీరజ, మత్స్య శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.