మహిళా శ్రేయస్సు కోసం ప్రభుత్వం కృషి
NEWS Oct 15,2024 01:39 pm
కొత్తగూడెం: మహిళల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నట్లు జిల్లా మహిళా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న చెప్పారు. మంగళవారం మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ముఖ్య మహిళ నేతలతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో మహిళా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపడుతున్నట్లు మహిళా అధ్యక్షురాలు పేర్కొన్నారు.