రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి
NEWS Oct 15,2024 01:19 pm
పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని ఇందిరా కాలనీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు డివైడర్ను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వారు బూర్గంపాడు మండలానికి చెందిన వారిగా స్థానికులు గుర్తించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.