ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం
NEWS Oct 15,2024 01:13 pm
సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాల, కళాశాలలో బీజేపీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు. మండల అధ్యక్షుడు పాలకొల్లు శ్రీనివాస్ ఓటు హక్కు నమోదుపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. మార్చిలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అర్హులైన ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.