పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
NEWS Oct 15,2024 01:11 pm
ఖమ్మం: ముదిగొండ మండలం గోకినపల్లిలో పలువురు లబ్ధిదారులకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొమ్మినేని రమేష్ బాబు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సిఫారసు మేరకు చెక్కులు మంజూరైనట్లు చెప్పారు. నిరుపేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.