చిట్టాపూర్: విగ్రహం ధ్వంసంపై నిరసన
NEWS Oct 15,2024 01:09 pm
సికింద్రాబాద్ సమీపంలోని ముత్యాలమ్మ ఆలయంలో దేవత విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో చిట్టాపూర్ యువకులు నిరసన వ్యక్తం చేశారు. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ విధ్వంసం జరిగిందని మన దేశంలో అనేకసార్లు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారని, హిందువులు సమయమనం పాటిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫాక్స్ చైర్మన్ నేరెళ్ల మోహన్ రెడ్డి, సామాజికవేత్త విష్ణువర్ధన్ రాజు శేఖర్ అంజిరాజ్ అందే సత్యం, తదితరులు పాల్గొన్నారు.