దసరా రోజు పాలపిట్టను బంధించిన జగ్గారెడ్డి
NEWS Oct 15,2024 11:54 am
వన్యప్రాణులను బంధించడం నేరమని చట్టం చెబుతోంది. కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి దసరా పండుగ రోజు రాష్ట్ర పక్షి పాలపిట్టను బంధించారు. సంగారెడ్డిలో దసరా వేడుకల్లో ఓ బోనులో పాలపిట్టను బంధించి తెచ్చి ప్రజలకు బహిరంగంగా చూపించారు. దీనిని గుర్తించిన వణ్యప్రాణి సంరక్షకులు ఫిర్యాదు చేశారు. పండుగ రోజున పాలపిట్టలను బంధించవద్దని అటవీ శాఖ అధికారులు చెప్పినప్పటికీ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.