బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే
NEWS Oct 15,2024 11:48 am
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పలువురిని పరామర్శించారు. మల్యాల మండల కేంద్రానికి చెందిన పొన్నం తిరుపతి గౌడ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను, ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన స్థానిక బ్లాక్ ఆఫీస్కి చెందిన బొట్ల వంశీని.. మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఆదిరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ముత్యపు శంకర్, రాజేశ్వర్ రెడ్డి, వంశీధర్, మ్యాక లక్ష్మణ్, తిరుపతి, సుమన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.