బీజేపీలోకి డాక్టర్ ముత్యాల వెంకటరెడ్డి
NEWS Oct 15,2024 10:51 am
మెట్పల్లి అన్నమయ్య హాస్పిటల్ నిర్వహకులు డాక్టర్ ముత్యాల వెంకట రెడ్డి బీజేపీలో చేరారు. ఆయనకు ఎంపీ ధర్మపురి అరవింద్ బీజేపీ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు. వారితో పాటు రైతు నాయకులు బోతుకూరి రాజారెడ్డి, గోనెల రాజరెడ్డి, బద్దం గంగాధర్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ అడ్వకేట్ నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.