కొండగట్టులో కొనసాగుతున్న భక్తుల రద్దీ
NEWS Oct 15,2024 11:14 am
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం మంగళవారం భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. ప్రత్యేక, ధర్మ దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి, ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు స్వామివారిని దర్శించుకున్నారు.