అబ్దుల్ కలాం సేవలు చిరస్మరణీయం
NEWS Oct 15,2024 11:05 am
టేక్మాల్: మాజీ రాష్ట్రపతి ఏపిజే అబ్దుల్ కలాం దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కలాలి రాజేశ్వర్ గౌడ్ అన్నారు. టేక్మాల్ మండలం బొడ్మట్ పల్లిలో అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి గ్రామ ప్రజలతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భవాని అంజయ్య, చీలపల్లి రవిశంకర్, కునదొడ్డి శ్రీనివాస్, కంకర భరత్ భూషణ్, కొటంగారి శంకరయ్య, గడ్డం పాండరీ, కంకర కృష్ణ, పట్లోళ్ల సాయిప్రసాద్, శాపోద్దిన్, శ్రావణ్, కొటంగారి పాపయ్య, ముద్దాపురం నాగప్ప, నాగరాజు పాల్గొన్నారు.