లారెన్స్ బిష్ణోయ్ పంజాబ్కు చెందిన 31 ఏళ్ల గ్యాంగ్స్టర్. డబ్బున్న కుటుంబం. చండీగఢ్లోని కళాశాలలో చదువుతున్నప్పుడు విద్యార్థి రాజకీయాల్లోకి ప్రవేశించాడు. ఆ తర్వాత నేర జీవితంలోకి అడుగుపెట్టాడు. అతనిపై తొలి క్రిమినల్ కేసు, హత్యాయత్నం 2010లో నమోదైంది. అప్పట్లో లారెన్స్ను అరెస్టు చేసి సబర్మతి సెంట్రల్ జైలుకు తరలించారు. అయినప్పటికీ అతడు తన ముఠా కార్యకలాపాలను నియంత్రిస్తూనే ఉన్నాడు. అతని క్రిమినల్ యాక్టివిటీస్ దోపిడీ నుంచి హత్య వరకు ఉంటాయి. అతని గ్యాంగ్ ఉత్తర భారత్ అంతటా విస్తరించింది.