మెట్పల్లి: వెల్లుల్ల గ్రామంలో అబ్దుల్ కలాం జయంతి కార్యక్రమాన్ని మాజీ సింగిల్ విండో చైర్మన్ మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ యువకులు నరేష్, సంజీవ్ మారుతి, మహేష్, రాజేష్, శ్రీధర్, రవి, భాను, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా యువత కూడా కలలు కని వాటిని నిజం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు.